దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) వండడం ఎలా?

ఈ టపా చూడగానే అన్నం వండడం కూడా రాయాలా మాకు రాదా అనిపించొచ్చు. నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని, ఏ బియ్యం అయితే ఏముంది అన్నమే కదా అని.బాగా శుద్ది చేసిన తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యం మంచిదని, అందులో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్(పిండి పదార్థాలు) మెల్లగా శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ, శరీరంలో గ్లూకోస్ నిల్వలు ఒక్కసారిగా పెరిగేటట్లు చేయవు అని తెలుసుకొని వాడి చూద్దామని చాలా సంవత్సరాల క్రితం మొట్టమొదటి సారిగా దంపుడు బియ్యం కొన్నాను. మామూలుగా అన్నం వండినట్లే వండేశాను. అన్నం సహించలేదు, అస్సలు తినబుద్ది కాలేదు. మొదటిసారి కదా తినడం అందుకని అలాగే వుంటుందేమో అనుకుని సర్ది చెప్పుకున్నాను.రెండు మూడు రోజుల తర్వాత కూడా అదే పరిస్థితి, ఇక తినలేక మిగిలిన బియ్యాన్ని దోశలకు వాడి మొత్తానికి అవగొట్టేశాను. ఆరోగ్యానికి మంచిదంటారు కదా మరి ఎందుకు తినలేక పోతున్నాము అన్న ఆలోచన మాత్రం వదలకుండా వెంటాడేది. ఒకరోజు అనిపించింది వండడంలో ఏదైనా కిటుకు ఉందేమో అనిపించేది. అలా నెట్‌లో వెతగ్గా వెతగ్గా దంపుడు బియ్యాన్ని వండే విధానం కనపడింది. ఇక అప్పటి నుండి ఈ పద్దతిలోనే వండడం మొదలు పెట్టాను.

IMG_5349IMG_5337అన్నం వండుకునేందుకు ఒక పూట ముందుగా (అంటే మధ్యాహ్నానికి అన్నం వండుకోవాలంటే ఉదయాన్నే)సరిపడా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
IMG_5339ఈ బియ్యంలో ఎక్కువ నీళ్ళుపోసి నానబెట్టుకోవాలి.
IMG_5343IMG_5345అన్నం వండే ముందు ఈ నీళ్ళలో నుండి ఒక సీసాడు నీళ్ళు తీసి ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి.
IMG_5346ఇక బియ్యాన్ని బాగా కడిగి ఒక గ్లాసుకు రెండు గ్లాసుల కొలతతో నీళ్ళు పోసి వండుకోవాలి.
IMG_5340మళ్ళీ అన్నం వండుకోవాలంటే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకునేముందు సీసాలో తీసి ఉంచుకున్న నీళ్ళు పోసి నానబెట్టాలి.
ఇలా ప్రతిసారీ వండే ముంది ఒక సీసా నీళ్ళు తీసిపెట్టుకోవడం, ఈ నీళ్ళను నానబెట్టే ముందు కలుపుకోవడం చేసుకోవాలి.ఇలా నీళ్ళు తీసి దాచుకోవడం వల్ల నీళ్ళు బాగా పులుస్తూ ఉంటాయి. ఇలా పులిసిన నీళ్ళలో నానబెట్టడం వల్ల ప్రోబయాటిక్ బాక్టీరియా పెరిగి అన్నం బాగా జీర్ణమవ్వడానికి తోడ్పడుతాయి.

బార్లీ పొంగలి

బార్లీ గింజలు మనం తినే ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.బార్లీతో పొంగలి రుచిగా కూడా ఉంటుంది.

IMG_5336కావలసిన పదార్థాలు
బార్లీ – 1 1/2 కప్పులు
పెసరపప్పు – 1 కప్పు
నీళ్ళు – 8 కప్పులు
ఉప్పు – తగినంత
జీలకఱ్ఱ, కరివేపాకు, మిరియాలు – కొద్దిగా
నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
IMG_5315బార్లీ గింజల్ని రాత్రి నీళ్ళలో నానబెట్టి, వండేముందు కడిగి పెట్టుకోవాలి.
IMG_5317పెసరపప్పు తీసుకుని మందపాటి పాత్రలో నూనె లేకుండా వేయించుకోవాలి.
IMG_5318వేగిన పెసరపప్పుని బార్లీ తో పాటు కడిగి ఉంచుకోవాలి.
IMG_5319పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులో నూనె/నెయ్యి పోసి, వేగాక జీలకఱ్ఱ, మిరియాలు వేసి వేయించాలి.
IMG_5320వేగాక కరివేపాకు కూడా వేసి వేయించాలి.
IMG_53218 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి.
IMG_5324నీళ్ళు మరిగాక, కడిగి ఉంచుకున్నబార్లీ,పెసరపప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
IMG_5327IMG_5329ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 5-6 కూతలు వచ్చేవరకు ఉడికించాలి.

ఉలవ పొడి

ఉలవలతో పొడి చేసుకుని, కంది పొడి, చనిక్కాయల పొడి లాగా అన్నంలోకి, ఇడ్లీ,దోశలలోకి తినడానికి బాగుంటుంది.
IMG_5314కావలసిన పదార్థాలు
ఉలవలు – 1/2 కప్పు
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్లు
నువ్వులు – 3 టేబుల్ స్పూన్ల్స్
ఎండు మిరపకాయలు – 3-4 (తినే కారానికి సరిపడా)
కరివేపాకు – కొద్దిగా
ఇంగువ – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
IMG_5301శుభ్రం చేసుకున్న ఉలవల్ని నూనె లేకుండా మందపాటి మాత్రలో బాగా వేయించాలి.
IMG_5302వేగాక పక్కకు తీసి ఉంచి, శనగపప్పు వేయించాలి.
IMG_5305శనగపప్పు వేగాక దింపేముందు  నువ్వులు వేసి కొద్ది సేపు వేయించి తీసి పెట్టాలి.
IMG_5306కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు,కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
IMG_5307అన్నింటినీ బాగా చల్లారనివ్వాలి.
IMG_5308చల్లారాక మిక్సి జార్‌లో తీసుకుని తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి.

పెసరమొలకల పులావ్

గింజల్ని మొలకెత్తించి తినడం చాలా మంచిది. అందుకని ఎప్పుడూ మొలకలు ఇంట్లో తయారుచేస్తూనే ఉంటాను. ఒకరోజు వీటితో పులావ్ చేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చి చేశాను.చాలా రుచిగా, తేలికగా అరిగేలా ఉంది.

IMG_5296కావలసిన పదార్థాలు
పెసలు – 1 కప్పు
బియ్యం – 2 కప్పులు
అల్లం – కొద్దిగా
పచ్చి మిరపకాయలు – 2-3
టమోటా – 2
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
కారం పొడి- తినే కారానికి సరిపడా
చెక్క, లవంగాలు, యాలకులు – కొద్దిగా
బిర్యాని ఆకు – 1
ఇంగువ
ఉప్పు – తగినంత
నూనె – 3 టేబుల్ స్పూన్లు
వేడి నీళ్ళు – 5
కొత్తిమీర – కొద్దిగా

IMG_5281పెసులు నానబెట్టి మొలకెత్తించుకుని ఉంచుకోవాలి.
IMG_5282బియ్యం శుభ్రంగా కడిగి వడేసుకుని ఉంచుకోవాలి.
IMG_5284ప్రెషర్ కుక్కర్లో నూనె పోసి వేడెక్కాక, చెక్క, లవంగాలు, బిరియాని ఆకు, ఇంగువ యాలకులు వేసి కొద్ది సేపు వేయించాలి.
IMG_5285మసాలా దినుసులు వేగాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేపాలి.
IMG_5286పచ్చి మిరపకాయలు నిలువుగా తరుక్కొని నూనెలో వేసి వేయించాలి.
IMG_5287వేగాక సన్నగా తరిగిన టమోటా ముక్కలు,పసుపు వేసి మగ్గించాలి.
IMG_5289ముక్కలు మెత్తపడ్డాక కారం,ధనియాల పొడి,ఉప్పు వేసి 2-3 నిమిషాలు బాగా కలపాలి.
IMG_5290తరువాత పెసర మొలకలు వేసి మసాలా కలిసేలా బాగా కలపాలి.
IMG_5291ఇందులో కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కొద్ది సేపు కలపాలి.
IMG_5293తర్వాత వేడి నీళ్ళు పోసి,సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించాలి.
దీన్నిరైతాతో గానీ, ఏదైనా మసాలా కూరతో తిన్నా కానీ బాగా ఉంటుంది.

వెజిటబుల్ నూడిల్స్

నూడిల్స్ అంటే ఇష్టపడని పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ నూడిల్స్ తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.కొన్న వాటి కంటే ఆరోగ్యకరం కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పైగా మనకు ఇష్టం వచ్చిన పిండితో చేసుకోవచ్చు. వీటిని నేను బార్లీ పిండితో చేశాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు.

 

img_4961

కావలసిన పదార్థాలు:-
బార్లీ పిండి – మూడు కప్పులు
కూరగాయల ముక్కలు – 2-3 కప్పులు
వెల్లుల్లి – 2-3 రెబ్బలు
అల్లం – చిన్న ముక్క
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నీళ్ళు – సరిపడా
నూనె – 3-4 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – తినే కారానికి సరిపడా

img_4942

 

img_4943

పొయ్యి మీద మంచి నీళ్ళు పెట్టి బాగా మరిగించాలి.

img_4941

IMG_3793

బార్లీ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి.

IMG_2430కారాల పావుల్లో (జంతికల గొట్టం) ఈ పిండిని తీసుకొని నూడిల్స్ లాగా, ఇడ్లీ పాత్రల్లోకి వత్తుకోవాలి.

 

img_4946

పిండి అంతా వత్తుకున్నాక, ఇడ్లీ ఉడికించినట్లు ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించాలి.

 

img_4947

img_4949

 

10 నిమిషాల తర్వాత వెడల్పాటి పళ్ళెంలో విడి విడిగా తీసి చల్లారనివ్వాలి.

img_4951

కూరగాయలు సన్నగా తరుక్కోవాలి. నేను క్యారెట్, క్యాబేజ్, ఉల్లిపాయలు వేశాను. అల్లం, వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.

img_4953

సోయా సాస్, టొమాటో సాస్ రెండు ఒక చిన్న గిన్నెలో కలిపి ఉంచుకోవాలి.

img_4955

పొయ్యి మీద మందపాటి పాత్ర పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.

img_4956

వేగాక కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్ది సేపు మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలు మరీ మెత్తగా మగ్గకుండా చూసుకోవాలి.

img_4957

img_4958

ఇప్పుడు సాస్ పోసి బాగా కలపాలి.

img_4959

చల్లారపెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి పెద్ద మంట మీద బాగా కలపాలి.

img_4960

చివరలో అప్పుడే దంచిన మిరియాల పొడి వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది.

వంకాయ-కొత్తిమీర కారం

ఈ వంటకం స్నేహితురాలు చెప్పిన చేసి పంపిన వంట. వాళ్ళ ప్రాంతం (గోదావరి) లో వండుకునే వంటకం.

vankaya16

కావలసిన పదార్థాలు :-
వంకాయలు –  పావు కిలో
కొత్తిమీర  – ఒక కట్ట (మధ్యస్తంగా)
పచ్చిమిర్చి –  4
ఉప్పు  – తగినంత
పసుపు  – చిటికెడు
పొపుదినుసులు
మినప్పు , శనగపప్పు తలొక స్పూన్ , ఆవాలు అరస్పూన్
నూనె ఒక గరిటెడు

vankaya8

vankaya3

పచ్సిమిర్చి, కొత్తిమీర కడిగి మిక్సీ లొముద్దగా చేసుకోవాలి. అవసరమైతె కాస్త నీరు పోసుకోవచ్చు

vankaya2టమాటాలు చిన్న ముక్కలుగా కొసుకొవాలి. వంకాయలు చీరికలుగా నీళ్ళలో తరుక్కోవాలి.

vankaya4మూకుడులో నూనె పొసి వేడెక్కాక పోపుదినుసులు వేయాలి.

vankaya7అవి వేగాక టమాటాలు వేసి మూత పెట్టాలి

vankaya6టమాటాలు మెత్తగా మగ్గాక, పచ్చిమిర్చి ముద్దవేసి పచ్చి వాసన పోయేదాకావేయించాలి. ముద్దలొ బాగా నీరుంటే దగ్గరపడేదాకా మళ్ళీ మూత పెట్టాలి.

vankaya13 vankaya18
ఇది వేగాక వంకాయముక్కలు వేసి ఉప్పు , పసుపు వేసి మూకుడు మీద మూతపెట్టి కొద్దిగా నీరు పోయాలి.

vankaya17నీటి ఆవిరికి వంకాయలు మగ్గిపొతాయి. బాగా కలిపి దింపేసుకోవడమే

వాడప్పం

ఈ వంటకం నేను చిన్నప్పుడు మాకు తెలిసినవాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకునేవాళ్ళు.వాళ్ళది రాయలసీమలో కర్ణాటక సరిహద్దు ప్రాంతం. కర్ణాటకలో చేసుకునే వంటకం కావచ్చు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రయత్నించి చూద్దాం అనిపించి చేశాను.

img_4934

కావలసిన పదార్థాలు :-
బియ్యప్పిండి(కడిగి ఆరబెట్టి పిండి కొట్టించినది) – 1 కప్పు
జీలకఱ్ఱ – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా

 

img_4925

పొయ్యి మీద మందపాటి పాత్రలో అరకప్పు నీళ్ళు ఉప్పు వేసి మరిగించాలి.మరిగాక బియ్యప్పిండి,జీలకఱ్ఱ వేసి బాగా కలపాలి.

img_4929

తరువాత పొయ్యి ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారాక కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి బాగా మర్థించాలి.

img_4930

ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగ చేసుకుని పూరీల్లాగ వత్తుకోవాలి.వత్తుకోవడానికి కఱ్ఱతో లేక పూరీ ప్రెస్ కానీ వాడచ్చు.

 

img_4933

 

img_4932

పిండి అంతా పూరీల్లాగా వత్తుకున్నాక, బాణలిలో నూనె పెట్టి నూనె వేడెక్కాక పూరీల్లాగా వేయించుకోవాలి.

పనసగింజల పచ్చడి

ఇప్పుడు పనసపళ్ళ కాలం కాబట్టి బజార్లో పనసతొనలు విరివిగా దొరకుతున్నాయి. కేరళ వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు పనసగింజలతో ఎన్ని రకాలు వండుతారో తెలిసింది. నాకు అప్పటివరకు వీటిని ఉడికించుకునో లేదా వేయించుకునో తినడం మాత్రమే తెలుసు. ఈ పనసగింజల పచ్చడి చాలా సులువుగా అయిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంది ప్రయత్నించి చూడండి.

img_4924

కావలసిన పదార్థాలు :-
పనసగింజలు – 10
పచ్చికొబ్బెర – అర కప్పు
పచ్చిమిరపకాయలు – తినే కారానికి సరిపడా
పులుపుకి – నిమ్మరసం/పచ్చి మామిడికాయ/చింతపండు కొద్దిగా
ఉప్పు తగినంత
పోపుకి
ఆవాలు
జీలకఱ్ఱ
ఎండుమిరపకాయలు
కరివేపాకు
ఇంగువ
నూనె

 

img_4917 (1)

పనసగింజలు శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి.

img_4918 (1)

ఉడికిన పనసగింజల పైన ఉండే ప్లాస్టిక్ లాంటి పొర తీసి వేసుకోవాలి.

img_4919 (1)

పచ్చికొబ్బెర చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.

img_4922 (1)

మిక్సీజార్‌లో ఉడికించిన పనసగింజలు,పచ్చికొబ్బెర,పచ్చిమిరపకాయలు,ఉప్పు చింతపండో/మామిడి ముక్కలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.నేను పులుపుకోసం చింతచిగురు ముద్ద వేశాను.

img_4923 (1)

చివరగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది.

చింతచిగురు రసం

గతవారం కొద్దిగా వర్షం పడడం వల్ల చింతచిగురు బాగానే దొరుకుతోంది. తెలిసిన వాళ్ళు చాలా చింతచిగురు తెచ్చిచ్చారు. పప్పు,పచ్చడి కాకుండా ఇంకా ఏమేమి వండచ్చు అని ఆలోచిస్తే రసం ఎందుకు చేయకూడదు అనిపించింది. రసంలో ఎలాగూ చింతపండు వాడతాం కదా, దాని బదులు చింతచిగురు వేసి చేసి చూద్దాం అని మొదలుపెట్టాను. బాగా వచ్చింది.

img_49001 (1)

కావలసిన పదార్థాలు :-
చింతచిగురు – గుప్పెడు
టమోటాలు – 2
ఉడికించిన కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
రసం పొడి – 1-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా
పోపుకి
నూనె
ఆవాలు
జీలకఱ్ఱ
ఇంగువ
ఎండుమిరపకాయలు
కరివేపాకు

 

img_4894 (1)

చింతచిగురు శుభ్రంగా కడిగి, పొయ్యి మీద గిన్నెలో నీళ్ళు వేసి ఉడికించాలి.

img_4895

బాగా ఉడికాక టమోటా గుజ్జు, ఉడికించిన కందిపప్పు, రసంపొడి,ఉప్పు, బెల్లం వేసి బాగా ఉడికించాలి.

 

img_4897 (1)

img_4898 (1)

బాగా ఉడికాక పోపు వేసుకుంటే రసం తయారైనట్లే.

img_4899 (1)

గోరుచిక్కుడు పచ్చడి

గోరుచిక్కుళ్ళతో పచ్చడి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులువు. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది.

img_48841 (1)

కావలసిన పదార్థాలు:-
గోరుచిక్కుళ్ళు – 1 కప్పు
చనిక్కాయలు – 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు – తినే కారానికి సరిపడా
ఉప్పు – తగినంత
చింతపండు – కొద్దిగా
పోపుకి
కరివేపాకు
ఆవాలు
జీలకఱ్ఱ
ఇంగువ
ఎండుమిరపకాయలు
నూనె

గోరుచిక్కుళ్ళను కడిగి చిన్న ముక్కలుగా వలిచి పెట్టుకోవాలి.

img_4874 (1)

పొయ్యి మీద బాణలి పెట్టి చనిక్కాయలు,శనగపప్పు,ధనియాలు వేయించుకోవాలి.

img_4875 (1)

వేగాక తీసి పక్కన ఉంచి, కొద్దిగా నూనె వేసి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి.

img_4876 (1)

ఎండుమిరపకాయలు వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇంకొంచం నూనె వేసి గోరుచిక్కుళ్ళను మగ్గించుకోవాలి.

img_4877 (1)

img_4878 (1)

అన్నీ చల్లారాక ఉప్పు,చింతపండు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

img_4881 (1)

img_4882 (1)

చివరగా పోపు వేసుకుంటే సరిపోతుంది.